ప్రజల్లో "మార్పు" రావాలి !


కొన్ని నెలలలో ఎన్నికలు సమీపిస్తున్నాయి . ఈ ఎన్ని కల ద్వారా మన గ్రామానికి ,లేక పట్టణానికి ప్రజాప్రతినిధి ని  ఎన్నుకోవాలి . ఎవడైతే ప్రజల కష్టాలు తనవి గా భావించి ,స్పందించి తక్షణం దానికి పరిష్కారం వెతికి పనులు పూర్తి చేసి ,అభివృద్ధి చేస్తారో వారిని ఎంచుకోండి .కానీ అనాదిగా  ఏమి జరుగుతుంది ?


ముఖ్యంగా మనిషి ఆశాజీవి,ఎవరో వచ్చి ఎదో చేస్తాడని ఎదురు చూస్తాడు ,సోమరితనం తో పని చేయకుండా డబ్బు ఎలా పొందాలి అనుకొనే వారు లేకపోలేదు!
చదువు లేక కొంతమంది ,చదువుకొన్నా ఉద్యోగ,ఉపాధి అవకాశము లేక కొందరు ఖాళీగా ఉంటారు.
"తప్పు దారిలో ఐనా వెళ్లి డబ్బు సంపాదించాలి" అని ఈజీమనికి అలవాటు పడినవారు మరికొందరు .
దీనిలో పరోక్షం గా ప్రభుత్వ ప్రమేయం ఉండి ,ప్రజాసంక్షేమం పథకాలు పేరు చెప్పి  (రూపాయి కి కిలోబియ్యం,ఆడవాళ్ళకి అంగనివాడిలో పావలా వడ్డీ ) వంటివి తక్కువ ధర కి, కొన్ని ఉచితంగానో  ఇచ్చి,చేసే  పనికి కూడా వెళ్లకుండా ప్రోత్సహిస్తున్నారు .
వీరిని అదనుగా చూచి ,ప్రత్యక్ష ఎన్నికలు వస్తాయి అని తెలియగానే కొన్ని పార్టీలకి చెందిన నాయకులు వారికి గేలం వేస్తారు .నీకు ఏమి భయం లేదు "నీ లైఫ్ హ్యాపీ గా ఉండేలా నేను చూసుకుంటా" అని మభ్యపెడతారు .కులంతోనో ,డబ్బుతోనో,మద్యంతోనో వారి  మీద ప్రేమ నటించి, వారి మాట వినే లా చేసుకొని ,ఎవరైనా ఎదురుతిరిగితే వారిని బుద్ధి  బలంతోనో ,అంగ బలంతోనో నోరు మూసే లా చేస్తారు .అవసరం ఐతే చంపడానికి కూడా పురికొల్పుతారు.
ప్రజలు కూడా అంత అమాయకులు కాదు ఎప్పటివరకు తన అవసరాలకు ,జల్సా లు సాగుతాయో అప్పటివరకు వారి జెండా మోస్తారు . నాయకులు ప్రవర్తన తేడా రాగానే వేరే జెండా కి జై కొడతారు .
ఆ రోజు గడిస్తే చాలు అనుకునే వారు చాలామంది !ముఖ్యంగా వారు పెట్టె బిర్యానీకి ,డబ్బు కి దాసోహం అవుతారు .
నాయకులు ఇచ్చే 1000 లేక 2000 తో తమ తక్షణ అవసరాలు తీరుతాయని ఆలోచిస్తారు కానీ ఐదు సంవత్సరాలకు భవిష్యత్ ఏమిటని పట్టించుకోరు. డబ్బుకోసం తమ భవిష్యత్తు తాకట్టు పెడుతున్నాం అని చూడరు.
ఆ వచ్చిన నాయకుడు గెలిస్తే వీరి ముఖం కూడా చూడడని తరువాత జ్ఞానోదయం అవుతుంది .
ఓటు అనేది ఒక ఆయుధం ,ఆ విజ్ఞానం లేక తమ ని తాము మోసం చేసుకొంటున్నారు . దీని గురించి ప్రభుత్వములో ఎంత నెట్టి నోరు కొట్టుకొన్నారు,ప్రచారాలు చేసిన వీరికి చలనం వుండదు.
ఏ ఎన్నికలు చూడండి 70-80 శాతం ఓటింగ్ దాటి దాఖలాలు లేవు ,అన్ని అయ్యాక వీడు అది చేయలేదు ఇది చేయలేదని ఏడుస్తారు .

ఎన్నికల సమయం :
ఎన్నికల సమయం :
ఎన్నికల సమీపించే తరుణంలో సమీకరణాలు మారిపోతాయి . ఒక నాయకుడు ప్రత్యర్థి ని ఎలా దెబ్బ కొట్టాలో వ్యూహరచన చేస్తాడు .
దానిలో మొదటిది  - "ఓటర్లని ప్రలోభ పెట్టడం"-ఒక పార్టీ 500 ఇస్తే రెండో పార్టీ 1000 ఇస్తారు .పెద్దమొత్తం లో డబ్బు చేతులు మారడము ,అనుమానంరాకుండా వారి
రెండోది -  దొంగ దారి అంటే ప్రత్యర్థి పార్టీ లో వారిని నయానో,భయానో  పోటీచేయకుండా ఉంచడం , ప్రత్యర్థి పార్టీలోనే ఉంటూ వీరి తో చేతులుకలిపి చివరినిమిషంలో వారికీ శత్రువుగా మలుస్తారు .అలా చేసిన తరువాత "ఎమోషనల్ బ్లాక్ మెయిలు",నువ్వు ఎన్నికలనుంచి తప్పు కోకపోతే నేను 'ప్రాణత్యాగం చేసుకుంటా' అని బెదిరిస్తారు .
ఇలా చేసి మంచివారికి  ఓటమి ని చూపించి ,వాళ్ళు పీఠాన్ని అధిరోహించి కోట్లుగడిస్తున్నారు .


మూడోది - రిగ్గింగ్ , గ్రామాల్లో దొంగ ఓటరు కార్డులు పుట్టించి లేక ఉన్న కార్డులు  తప్పించి వారిబదులు వీరు ఓటు వేసి గెలిపిస్తున్నారు.ఇది నిజంగా దురదృష్టకరం .
పూర్వం అంటే మనకి అంత అవగాహన లేదు అనుకుందాం, కానీ ఇప్పుడు కూడా చూసీచూడనట్లు చేస్తే ఎవ్వరికీ ఉపయోగం .
మిత్రులారా ఒక సారి ఆలోచించండి -డబ్బు తీస్కో ని ఓటు వేసి ఎవరికి  మేలు చేస్తున్నాము ?
వారు పదవులు పొంది అక్రమం గా ,అన్యాయం గా డబ్బు దోచుకొని దాచుకొంటున్నారు .
తిరిగి మనం ఆ  దానివల్ల మనకి ఏమి లాభం .
అగ్రరాజ్యల్లో ఇలాంటి పద్దతులు లేవే?
వారు అభివృద్ధి చెందుతున్నారు మనం మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అన్న చందంగా ఉన్నాం ,ప్రజలలో మార్పు వచ్చి అవినీతిరహిత దేశం గా చేయాలని కంకణం కట్టుకుందాం .
మాటల్లో కాదు చేతల్లో చేసి చూపుదాం ... జై హింద్ !!


Comments

Popular posts from this blog

జవాబు లేని ప్రశ్న ?

"భగవాన్ ... సర్ ...స్ఫూర్తి దాయకం .... "